నిజామాబాద్ క్రైం, మార్చి 11 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు కల్పిస్తూ డీజీపీ ఎన్.మ హేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సివిల్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న 24 మంది సిబ్బందికి హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించారు. 1990 నుంచి 1994 బ్యాచ్ వరకు ప్రస్తు తం కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఆర్డర్ కాపీని సిబ్బందికి అందజేశారు. ప్రమోషన్ పొందిన సిబ్బంది ప్రస్తుతం రెండు జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్నారు. వారిని ఇతర పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసేందుకు సీపీ నాగరాజు ఆర్డర్లు జారీ చేయనున్నారు. అయితే కోరుకున్న పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఎంపిక చేసుకునే అవకాశం సిబ్బందికి కల్పించారు. ప్రమోషన్లు పొందిన 24 మంది సిబ్బంది వారికి పోస్టింగ్ కావాల్సిన మూడు పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసుకొని సీపీకి అందజేయాల్సి ఉంటుంది. కోరుకున్న చోట పో స్టింగ్ కోసం అవకాశం ఇవ్వడంపై సిబ్బం ది హర్షం వ్యక్తం చేస్తున్నారు.