నిజాంసాగర్, మార్చి 25: త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్నది. ఇందులో భాగంగా జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీకల్యాణ మండపంలో మంగళవారం పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జడ్పీచైర్పర్సన్ దఫేదార్ శోభ, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ హాజరుకానున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.