కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సభా ప్రాంగణాలు జనసంద్రాన్ని తలపించాయి. గులాబీ జెండాలు చేతబూని వేలాదిగా తరలివచ్చిన జనంతో సభా ప్రాంగణాలు గులాబీ వనాన్ని తలపించాయి.
సీఎం కేసీఆర్ ప్రసంగానికి జనం ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు. భారీగా తరలివచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సభలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది.