రుద్రూర్, నవంబర్ 6 : రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నాయకులను ఆదరించాలని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలో సోమవారం ప్రచారం చేపట్టారు. అంబం గ్రామం లో పోచారం శ్రీనివాసరెడ్డికి బైక్ర్యాలీ, మంగళహారతులతో స్వాగతం పలికారు. హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించారు. నోటు కోసం ఓటును అమ్ముకోవద్దని, సంక్షేమానికి పట్టం కట్టాలని అన్నారు. అంబంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యురాలు స్వచ్ఛందంగా పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంబం గ్రామానికి చెందిన పోచారం సన్నిహితు డు ఐ.సాయిలు కుమార్తె సుష్మ మాట్లాడుతూ.. ఇలాంటి నాయకు డు ఉండడం బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అదృష్టమని, వేరే జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి చేసినంత అభివృద్ధి చేయలేదని, ఈ నాయకుడిని వదులుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్లే అని తెలిపారు. అక్బర్నగర్లో బీసీ, మైనార్టీ, అంబేద్కర్ కాలనీలకు చెందిన ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి మేమంతా పోచారం వెంట ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. రాణంపల్లి, చిక్కడ్పల్లి, రాయకూర్, రాయకూర్ క్యాంపు, సిద్దాపూర్, సులేమాన్ నగర్ గ్రామాల్లో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ గంగారాం, ఎంపీపీ సుజాత, వైస్ ఎంపీపీ సాయిలు, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, మం డల కార్యదర్శి బాలరాజు, విండో మాజీ అధ్యక్షుడు పత్తి రాము, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, సర్పంచులు భాగ్య, గంగామని, రోజా, పుష్పలత, గంగారాం, లక్ష్మణ్, నిర్మల, ఖాదర్, ఎంపీటీసీలు సావి త్రి, హన్మంత్రావు, పార్టీ గ్రామాధ్యక్షులు మోహన్, హన్మాండ్లు, పోశెట్టి, హబీబ్, సీనియర్ నాయకులు సంజీవ్, రామాగౌడ్, పెద్ద హన్మంతు, గోపాల్, లాల్మహ్మద్, రాములు ఉన్నారు.
బాన్సువాడ రూరల్/బాన్సువాడ/నస్రుల్లాబాద్/కోటగిరి, నవంబర్ 6 : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని కొయ్యగుట్ట, బోర్లం క్యాంపు, హన్మాజీపేట్, ఇబ్రహీంపేట్, తిర్మలాపూర్, బోర్లం, కొల్లూరు, దేశాయిపేట్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఇంటింటికీ తిరుగుతూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్నాయక్, రాజేశ్వర్ గౌడ్, బుడ్మి సొసైటీ మాజీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, హకీం, నాయకులు ప్రశాంత్కుమార్, శ్రీనివాసరెడ్డి, వెంకటరమణ, కొండ శ్రీశైలం, పీర్యానాయక్, రతన్, భీంసింగ్, శ్రీనివాసరెడ్డి, దేవేందర్రెడ్డి, సాయిలు, సుభాష్, గోపన్పల్లి సాయిలు, జలీల్, మైబూబ్, హైమద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణం ఐదో వార్డులోని డబుల్బెడ్ రూం కాలనీలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.నస్రుల్లాబాద్ మండలంలోని బస్వాయిపల్లి, నస్రుల్లాబాద్, మైలారం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకే ఓటు వేసి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ పాల్త్య విఠల్, నాయకులు ప్రతాప్ సింగ్, శ్యామల, కంది మల్లేశ్, మోహన్, భానుప్రకాశ్, ప్రభాకర్ రెడ్డి, కలీల్, సాయిరాం యాదవ్, కర్ణం భాస్కర్ పాల్గొన్నారు.
కోటగిరిలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బీసీ కాలనీలో కూడా ప్రచారం చేశారు. కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్దూ, సైలంపూర్ హౌగిరావుపటేల్, పార్టీ గ్రామ అధ్యక్షుడు అనిల్ కులకర్ణి, వార్డు సభ్యులు దయానంద్, విజయ్, కన్నం సాయిలు, పాల గంగారాం, లాలయ్య, దినేశ్ పాల్గొన్నారు.
బాన్సువాడ టౌన్, నవంబర్ 6 : బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. బాన్సువాడలోని 6, 7వ వార్డుల్లో సోమవారం స్థానిక నాయకులు, కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, స్థానిక కౌన్సిలర్లు సరిత, లింగమేశ్వర్, కిరణ్ కుమార్, బీఆర్ఎస్ బాన్సువాడ పట్టణం మహిళా అధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్య దర్శి ప్రతిమారెడ్డి, యూత్ అధ్యక్షుడు యూనుస్, నాయకులు ప్రవీణ్రెడ్డి, రాజు, నర్సగొండ, రమేశ్, శివ, శివసూరి, మహేందర్, విఠల్రెడ్డి, భాగయ్య తదితరులు పాల్గొన్నారు.