రుద్రూర్, మార్చి 10: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముం దుకుసాగుతున్నదని పేర్కొన్నారు. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రుద్రూర్ నుంచి సులేమాన్నగర్ వరకు సభాపతికి బైక్ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.37లక్షలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.9లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఐకేపీ భవనాన్ని ప్రారంభించి, రూ. 20లక్షల నిధులతో చేపట్టనున్న పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.10లక్షలతో చేపట్టనున్న ఆరోగ్య ఉపకేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ..దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. ఈ అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. ఇంత అభివృద్ధి జరిగినా కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఫంక్షన్హాలుకు అదనంగా రూ.10 లక్షలు, మరో ఫంక్షన్హాళ్లకు కిచెన్షెడ్డు, ప్రహరీ నిర్మాణ పనులకు రూ.30లక్షలు, గౌడ, బీసీ సంఘాల భవనాల కోసం రూ.15 లక్షలు, సేవాలాల్ మహరాజ్ ఆలయ నిర్మాణానికి రూ.10లక్షల నిధుల అందజేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ. 5 లక్షలు కేటాయించారు. అనంతరం మం డల నాయకులతో కలిసి బారెడు పోచమ్మ నూతన ఆలయ ప్రారంభోత్సవ, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ గంగారాం, సర్పంచ్ ఖాదర్, ఉప సర్పంచ్ లిఖిత, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాల్రాజ్, విండో మాజీ అధ్యక్షుడు పత్తి రాము, కో-ఆప్షన్ మెంబర్ మస్తాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు.