హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరు లు బోగస్ పత్రాల ఆధారంగా ఓటర్ల జా బితాలో చేరుతున్నారనే ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో గిరిజనేతరుల పేర్ల తొలగింపునకు తీసుకున్న చ ర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సం బంధిత అధికారులకు నోటీసులు జారీచేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మ ణుగూరు మండలానికి చెందిన ఆదివాసీ సేన అధ్యక్షుడు ఎం దౌలత్రావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. న కిలీ నివాస ధ్రువీకరణ పత్రాల ఆధారం గా గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదవుతున్నారని, ఇది షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగం కల్పించి న ప్రత్యేక రక్షణకు విరుద్ధమని తెలిపా రు. వాదనలు నమోదు చేసిన ధర్మాస నం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.