హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎనలేని సేవలందించి, వాసవి హాస్పిటల్ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసిన 90 ఏండ్ల గంజి రాజమౌళి గుప్తా తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి గుప్తాను పార్లమెంట్ మాజీ సభ్యులు, పార్టీ కార్యాలయ ఇంచార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.