హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ దశల పోరాటాల్లో అక్రమ కేసులు, అరెస్టులు, జైలు శిక్ష ఎదురొన్న ఉద్యమకారుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డీజీపీ సీవీ ఆనంద్ను కోరారు. ఉద్యమకారుల పోరాటాలను గుర్తించి వారికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియలో భాగంగా సంబంధిత రికార్డుల సేకరణ అవసరమని కమిటీ సభ్యులు పేరొన్నారు.
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు పోలీసు శాఖ తరఫున సహకారం అందిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. సంబంధిత రికార్డుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేస్తామని చెప్పినట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.