సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట్: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పోలీసు, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులు మంగళవారం సంయుక్తంగా బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు నిమజ్జన రూట్ మ్యాప్ను పరిశీలించారు.నగర సీపీ సజ్జనార్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక తదితరులు బాలాపూర్ గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ నుంచి బస్సు యాత్రగా శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు.