కామారెడ్డి/ఖలీల్వాడి, ఫిబ్రవరి 20 : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం 44 బృందాలు 5543 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 729 కళ్ల అద్దాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,11,606 మందికి పరీక్షలు నిర్వహించి 19,163 మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేశామని డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. సోమవారం 8,883 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 1,196 మందికి అద్దాలు అందజేశామన్నారు. ఇప్పటి వరకు 1,85,883 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 54,686 మందికి అద్దాలు అందించినట్లు చెప్పారు.