ధర్పల్లి/సిరికొండ, సెప్టెంబర్ 13 : ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ శాఖ డివిజనల్ కార్యాలయ నూ తన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పంచాయతీరాజ్ ఈఈ, డీఈ, పంచాయతీరాజ్శాఖ అధికారులను సన్మానించారు. అభివృద్ధి విషయంలో ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో రెండు మండలాలకొక పంచాయతీరాజ్ డివిజనల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ డివిజనల్ కార్యాలయాలకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ అని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు. సిరికొండలో ఏర్పాటు చేసిన సభలో ఆయ న మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచా రాలను నమ్మవద్దన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో వివిధ పార్టీల్లో ఉన్న వారికి సైతం లబ్ధి చేకూరిందని, ఇది నిజమా కాదా అని ప్రశ్నించా రు. అనంతరం వివిధ కులసంఘాలకు, మహిళా సంఘ భవనానికి రూ. కోటీ 16 లక్షల మంజూరు పత్రాలు అందజేశారు.
సిరికొండ మండలంలోని సర్పల్లి తండాకు చెంది న 31 మంది బీజేపీ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సమక్షంలో బుధ వారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.