బాన్సువాడ, మే 5: బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరుతున్నారు. తాజాగా వర్ని మండలం శంకోరా గ్రామ మాజీ ఎంపీటీసీ మంగ్యానాయక్తోపాటు పలువురు ఆదివారం మాజీ స్పీకర్ పోచారం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి పోచారం గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసపూరిత హామీలను ఇచ్చి వంచన చేస్తున్నదని మండిపడ్డారు. అమలుకానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. పోచారం నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మండల బంజార నాయకుడు రంజ్యా నాయక్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మాక్లూర్, ఏప్రిల్ 5: మండలంలోని మాదాపూర్ గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి జీవన్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరునెలల్లో కూలిపోతుందన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంకాపూర్లోని జీవన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శశి, బండి సురేశ్, వేణు, భూమేశ్, సాయిలు యాదవ్, సంపత్, సురేశ్ పాల్గొన్నారు.