ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతూనే ప్రజలు, విద్యుత్ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఇంట్లో పాటించాల్సినవి…
రైతులు మీరు కూడా పాటించండి..
విద్యుదాఘాతంతో 18 నెలల బాలుడు మృతి
భిక్కనూరు, జూలై 25 : విద్యుదా ఘాతంతో 18 నెల ల బాలుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండ లం అంతంపల్లి గ్రామంలో సోమ వారం రాత్రి చోటు చేసుకున్నది. ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన బండి ప్రవీణ్, రమ్య దంపతులకు కుమారుడు శ్రీతిక్ (18 నెలలు) ఉన్నాడు. రమ్య అనారోగ్యంతో ఉండడంతో కొన్ని రోజులుగా తల్లిగారి గ్రామమైన అంతం పల్లిలో ఉంటుంది. సోమవారం కుమారు డిని ఎత్తుకొని ఇంట్లో ఇనుప వైరుతో కట్టిన దండెంపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యారు. తల్లీకొడుకు కింద పడిపోగా వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. శ్రీతిక్ అప్పటికే మృతి చెందగా, రమ్య ప్రాణాలతో బయటపడింది. రమ్య భర్త ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అందుబాటులో ఉంటున్నాం..
వానలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించిన సిబ్బంది మొత్తం అలర్ట్గా ఉన్నాం. సమస్య ఎదురైనట్లు సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బందితో కలిసి వెళ్లి పరిష్కరిస్తున్నాం. నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా కృషి చేస్తున్నాం. కరెంటు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలి.
– జి.శ్రీనివాస్, ఏడీఈ, డిచ్పల్లి