లింగంపేట, మే 24 : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను మంగళవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల మాదిరిగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు స్థలాలను పరిశీలించారు. లింగంపేట మండలంలోని ఎల్లారం, లింగంపేట గ్రామాల్లో అధికారులు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కు అనువైన స్థలాలను పరిశీలించారు. ఖాళీ స్థలాలు పరిశీలించిన వారిలో ఎంపీడీవో శంకర్, మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారి, ఏపీవో తులసీరాం, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు నయీం, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సాంకేతిక సహాయకులు రాజు, కృష్ణాగౌడ్ తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్లో..
నిజాంసాగర్, మే 24 : మండల కేంద్రంలో నీటి పారుదల శాఖకు చెందిన స్థలాన్ని మంగళవారం అధికారులు క్రీడా ప్రాంగణం కోసం ఎంపిక చేశారు. నీటి పారుదల శాఖకు చెందిన ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో పర్బన్న, పంచాయతీ కార్యదర్శి సంతోష్, రైతు బంధు సమితి కన్వీనర్ మహేందర్కుమార్ స్థలాన్ని పరిశీలించారు. ఏపీఎం శ్రీనివాస్, టీఏలు చందు, ప్రభాకర్, బాల్సింగ్ తదితరులు ఉన్నారు.
పిట్లంలో..
పిట్లం, మే 24 : పిట్లం గ్రామపంచాయతీ పరిధిలో క్రీడా మైదానం కోసం ఎంపీడీవో వెంకటేశ్వర్ గ్రామ పంచాయతీ స్థలాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్ ఈజీఎస్ పథకం ద్వారా స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పిట్లంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీవో బ్రహ్మం, పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఉన్నారు.