KTR | తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్(KTR )అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్(Jayashankar) జయంతి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఆర్కేసీఆర్ 2006లో రాజీనామా చేసి వెంటనే మళ్లీ 2008లో రాజీనామా చేసినప్పుడు నేను జయశంకర్ సార్ తో వాదన పెట్టుకున్నానని గుర్తు చేశారు. అప్పుడు సార్ నాతో ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయి. అవి మొదటి దశ భావజాల వ్యాప్తి, రెండవ దశ ఆందోళనాపథం ఈ రెండు కలిసి రాజకీయ శక్తిగా మారి యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి పోయి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవాలని గొప్ప మాట అన్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవి త్యాగంతో పుట్టింది
కేసీఆర్ గారు 2006లో రాజీనామా చేసి వెంటనే మళ్ళీ 2008లో రాజీనామా చేసినప్పుడు నేను జయశంకర్ సార్ తో వాదన పెట్టుకున్నాను
అప్పుడు సార్ నాతో ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయి అవి మొదటి దశ భావజాల వ్యాప్తి, రెండవ దశ… https://t.co/L8vjRjOUVf pic.twitter.com/howB0iCz9C
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026