ఆర్మూర్, ఏప్రిల్ 2 : పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి హామీని తుంగలో తొక్కిన ఎంపీ ధర్మపురి అర్వింద్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ పార్టీయా లేదా ప్రాంతీయ పార్టీయా చెప్పాలని సూచించారు. శుక్రవారం వారు పట్టణంలోని కుమార్ నారాయణభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో పసుపు ఉత్పత్తికి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు ప్రథమస్థానంలో ఉన్నాయన్నారు. కానీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలో పసుపు బోర్డుతో పాటు పసుపునకు క్వింటాలుకు రూ.15వేలు ఇస్తామని పొందుపర్చినట్లు తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెస్తానని, పసుపు పంటకు మద్దతు ధరను సైతం వచ్చేలా చూస్తానని ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారని గుర్తుచేశారు. కానీ కేంద్ర మంత్రులు పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని ఇటీవల స్పష్టం చేశారన్నారు. రైతులను మోసగించడంలో ఇదొక భాగమేనన్నారు. నలభై ఏండ్లుగా ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా ఉద్యమించి 178 మంది పసుపు రైతులు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్వింద్ తన పదవికి రాజీనామా చేసి పసుపు రైతులతో కలిసి ఉద్యమం చేయాలన్నారు. సమావేశంలో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు ప్రభాకర్, దేవరాం, దేగాం యాదాగౌడ్, జక్క లింగారెడ్డి, రాజన్న, ఆకుల గంగారాం తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
సోషల్ మీడియాలో రీఎంట్రీ ఇవ్వనున్న డోనాల్డ్ ట్రంప్
ఆఫ్ఘన్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆస్టిన్ అకస్మిక టూర్!
బ్రిటన్లో జనాభా గణన.. పాల్గొనని వారికి లక్ష జరిమానా
ఓ మహిళా ఉద్యోగి.. 36 రోజుల్లో 4 బదిలీలు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లో పంది మాంసం లేదు : కంపెనీ వివరణ