వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సోషల్ మీడియా అకౌంట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత.. ట్రంప్కు చెందిన ఎఫ్బీ, ట్విట్టర్ అకౌంట్లను నిషేధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన స్వంత ప్లాట్ఫామ్పై మళ్లీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇస్తారని ఆయన అడ్వైజర్ తెలిపారు. కానీ మరో రెండు లేదా మూడు నెలల తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా రీ ఎంట్రీ ఇస్తారని జేసన్ మిల్లర్ చెప్పారు. ట్రంప్కు చెందిన సోషల్ మీడియా గ్రూపు చాలా భిన్నంగా ఉంటుందని, సోషల్ మీడియా చరిత్రనే మార్చేస్తుందని ఆయన అన్నారు. ట్రంప్ రెచ్చగొట్టే ప్రసంగం ఇవ్వడం వల్ల క్యాపిటల్ హిల్ దాడి జరిగిందని, మరింతగా తన ప్రసంగాలతో ట్రంప్ ప్రజల్ని ఉసిగొల్పొద్దు అన్న ఉద్దేశంతో ట్విట్టర్ సంస్థ ఆయన అకౌంట్ను సీజ్ చేసింది. ట్రంప్ తన పదవీకాలంలో ప్రధాన మీడియాను పక్కనపెట్టి, కేవలం ట్వీట్ల ద్వారానే తన ఓటర్లతో ఆకర్షించారు.