కామారెడ్డి, ఆగస్టు 7 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.
కామారెడ్డికి మంజూరైన మెడికల్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం 235 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో నంబర్ 93ను విడుదల చేయడాన్ని హర్షిస్తూ జిల్లావ్యాప్తంగా సంబురాలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలోని పాటు వివిధ మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు.