Lawyers Protest | వినాయక్ నగర్, ఏప్రిల్ 08 : హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముత్తబా అలిపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇవాళ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో న్యాయవాదిపై దుండగులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
దాడులకు నిరసనగా తమ విధులను బహిష్కరించి న్యాయస్థానాల్లో విధులకు దూరంగా ఉన్నట్లు జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. న్యాయవాది ముత్తబా అలిపై దాడి చేసిన హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. దేశ, రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు హంతక ముఠాలచే హత్యలు, దాడులకు గురి కావడం ఆవేదన కలిగిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
హత్యలు, దాడుల పరంపర ఆగాలంటే న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని.. న్యాయవాదుల వృత్తికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్ట రూపకల్పనలో సహకరించాలని జగన్ కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి , సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్