బోధన్, జూలై 29 : బోధన్ మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు శుక్రవారం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కులను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, కౌన్సిలర్లు తూము శరత్రెడ్డి, అబ్దుల్లా, అశ్ఫాక్ లబ్దిదారులకు అందించారు. బోధన్ పట్టణానికి చెందిన 59 మందికి షాదీ ముబారక్, 13 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చారు. కార్యక్రమంలో బోధన్ తహసీల్దార్ వరప్రసాద్ పాల్గొన్నారు.
నేడు బోధన్ మండలంలో చెక్కుల పంపిణీ..
బోధన్ మండలానికి చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 11 గంటలకు బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ బోధన్ మండల అధ్యక్షుడు గోగినేని నరేంద్రబాబు, మండలం ప్రధాన కార్యదర్శి సిర్ప సుదర్శన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరుగుతుందని వారు పేర్కొన్నారు.
నవీపేటలో..
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపీపీ సంగెం శ్రీనివాస్ తహసీల్దార్ వీర్సింగ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ సూచన మేరకు నవీపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 74 మందికి చెక్కులను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వీర్సింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్, మోకన్పల్లి ఎంపీటీసీ బేగరి జనార్దన్, సిరన్పల్లి సర్పంచ్ సుధాకర్రావు, టీఆర్ఎస్ నాయకులు బాబు, సాయిలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.