నిజామాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఇవాళ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమని కొనియాడారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్ను అభినందించారు. ఒకరు మొక్క నాటి మరో ముగ్గురిని నాటాలని కోరడం ద్వారా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావ్, జనగామ కలెక్టర్ నిఖిల, మెదక్ కలెక్టర్ హరీష్కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.