ఖలీల్వాడి, నవంబర్ 21 : బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నగరంలోని బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆటో డ్రై వర్ల గురించి ఆలోచన చేశాడని, తమ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఫిట్నెస్ ట్యాక్స్ రద్దు చే శారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా తమ గురించి ఆలోచన చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని ముక్తకంఠంతో నినదించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తున్నది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నది. మా ఆటో డ్రైవర్ల గురించి గత ప్రభుత్వాలు ఏనాడూ ఆలోచన చేయలేదు. మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కే.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మా జీవితాల్లో వెలుగులు నిండాయి. ఒకవైపు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆటోలపై ఫిట్నెస్ ట్యాక్స్ను కూడా రద్దు చేశారు. ఇంతకన్నా ఏం కావాలె. మా గురించి ఆలోచన చేసిన బీఆర్ఎస్కే మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం.
మా బతుకుల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అందరం సంతోషంగా ఉన్నాం. వేరే పార్టీలకు ఓటు వేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. బీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్ గుప్తాకే మా ఓటు.
గత ప్రభుత్వాలు ఎన్ని ఏండ్లు పాలించినా మా గురించి పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ ఒక్కరే ఆటోడ్రైవర్ల్ల జీవితాల గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్కే మా సంపూర్ణ మద్దతు.