కామారెడ్డి/ఖలీల్వాడి, ఏప్రిల్ 18 : ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. కళ్లద్దాలు అందుబాటులో లేకపోతే ఆర్డర్ పెట్టి వచ్చిన వెంటనే అందజేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో మంగళవారం 44 బృందాలతో 5049 మందికి పరీక్షలు నిర్వహించి 385 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,11,270 మందికి పరీక్షలు నిర్వహించి… 47,235 మందికి కళ్లద్దాలను పంపిణీ చేసినట్లు డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 9,182 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 864 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,44,694 మందికి పరీక్షలు నిర్వహించగా 79,062 మందికి కళ్లద్దాలను అందజేసినట్లు డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు.