ఆర్మూర్, జూలై 31 : ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన ఒకరి బ్యాంకు ఖాతాలో లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఆరు నెలల క్రితం వరకు చికెన్ సెంటర్లో పని చేసినట్లు తెలిసింది. అనుమానితుడిని అధికారులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి, అటునుంచి విచారణ నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.