కమ్మర్పల్లి, మే 31 : కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో బుధవారం చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బీజేపీ నాయకులు పన్నాల గంగారెడ్డి, మల్యాల లక్ష్మణ్ గౌడ్, బీఎస్పీ నాయకులు సింగిరెడ్డి ముత్యంరెడ్డి, సింగిరెడ్డి గంగారెడ్డి, కూలిపాటి గంగారెడ్డి, గోవింద్, గంగాధర్, కాంగ్రెస్ నాయకుడు కొమ్ముల కిషన్, రైతు నాయకులు కొమ్ముల రాజేందర్, కొమ్ముల శ్రీధర్, కొమ్ముల మహిపాల్, సింగిరెడ్డి బాలకృష్ణ, సింగిరెడ్డి బాల్రెడ్డి, వేముల మోహన్రెడ్డి, వేముల శివారెడ్డి, రెంజర్ల రోహిత్ రెడ్డి, సింగిరెడ్డి జలపతిరెడ్డి, గోపిడి రాజేందర్, సంత రాజేందర్, కొమ్ముల రాజేందర్ తదితరులు ఉన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి.. మంత్రి వేముల వెంట నడిచేందుకు బీఆర్ఎస్లో చేరామని వారు తెలిపారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, బద్రి రాజశేఖర్, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బద్దం చిన్నా రెడ్డి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు లుక్క గంగాధర్, ఎండీ అహ్మద్ హుస్సేన్, హల్దె శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చింత గణేశ్, లోలపు సుమన్, సంత రాజేశ్వర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అజ్మత్ హుస్సేన్, తీగల హరీశ్రెడ్డి, రెంజర్ల మహేందర్రెడ్డి, బోడ దేవేందర్, కొమ్ముల రాజేందర్రెడ్డి, అమరగోని సదాశివ్ గౌడ్ పాల్గొన్నారు.