కామారెడ్డి, జూన్ 25 : కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా,జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్గా ముక్తిద గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ముక్తిద యాదాద్రి భువనగిరి జిల్లాలో అదనపు జిల్లా న్యామూర్తిగా విధులు నిర్వహించి, బదిలీపై కామారెడ్డికి వచ్చారు. ఆమెకు న్యాయశాఖ ఉద్యోగులు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో న్యాయాధికారులు డాక్టర్ సూర సుమలత, సుధాకర్, దీక్ష, ప్రధాన పరిపాలన అధికారి రాంచందర్ రావు, ఉషారాణి, సిబ్బంది భుజంగరావు, వెంకట్ రెడ్డి, చంద్రసేన్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, కరుణ, మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, ప్రభుత్వ న్యాయవాది శ్యాంగోపాల్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.