బాల్కొండ, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్కాల్ మండలాల్లో పర్యటించారు. బాల్కొండ మం డలం బస్సాపూర్లో రూ.20 లక్షలతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవనం, రూ.6 లక్షలతో నిర్మించనున్న గోసంగి సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్, నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ -82 పై రూ.14 లక్షలతో చేపట్టనున్న మరమ్మతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్కు ఉన్నం త ప్రేమ మరెవరికీ ఉండదన్నారు. ప్రజల సమస్యలు, వారి బాగోగులపై ఆయనకు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదన్నారు. ప్రజలకు ఏమి కావాలో కనీస అవగాహన కూడా లేదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో చం దమామ కథలు చెబుతారన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో గెలి స్తే రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ .. మొన్ననే గెలిచిన కర్ణాటకలో రూ.4 వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2 వేలు చేసింది సీఎం కేసీఆరే అని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మవద్దని సూచించారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, సకాలంలో ఎరువులు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కులవృత్తులకు ప్రోత్సాహం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలు, రైతులకు కేసీఆర్ భరోసా కల్పించారన్నారు. ఎద్దు, ఎవుసం మీద అవగాహన లేని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కూడా కేసీఆర్ను విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కరెంట్ సమస్య ఉండొద్దని సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నారని తెలిపారు. పదేండ్ల క్రితం కాంగ్రెస్ పెట్టిన గోస, తొమ్మిదేండ్లుగా కేసీఆర్ చేస్తున్న మంచిని మరిచిపోవద్దని కోరారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసి గెలిచిన ఎంపీ అర్వింద్ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మా టలు చెప్పడం కాదని, అభివృద్ధి చేసి చూపాలని సవాల్ చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ప్రజలంతా మంచి చేసిన కేసీఆర్కు మద్దతుగా నిలువాలని కోరారు.