బాన్సువాడ రూరల్, డిసెంబర్ 20: బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలలను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ సంవత్సరం 4వ తరగతి చదువుతున్నట్లుగా ధ్రువీకరణ పత్రం(బోనాఫైడ్)ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
l 1.09.2011 నుంచి 31.8.2015 లోపల జన్మించి ఉండాలి. (9 నుంచి 13 సంవత్సరాల్లోపు విద్యార్థులకు మాత్రమే)
l వార్షిక ఆదాయం రూరల్ వారికి రూ.1,50,000, అర్బన్ వారికి రూ.2,00,000 ఉండాలి.
http://tswreis.ac.in
http://tgtwgurukulam.telangana.gov.in
http://tgcet.cgg.gov.in
http://mjptbcwreis.telangana.gov.in
పాస్ పోర్టు సైజ్ ఫొటో, విద్యార్థి సంతకం
విద్యార్థి బోనాఫైడ్
వివరాలను అప్లోడ్ చేసే ముందుగానే జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 18 నుంచి జనవరి 6 వరకు ఆన్లైన్లో రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఉమ్మడి జిల్లాలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ప్రవేశపరీక్షలో వచ్చిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.
తెలుగు, ఇంగ్లిష్, గణితం, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం), పరిసరాల విజ్ఞానంలో 3,4 తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 100 మార్కులకు అబ్జెక్టివ్ టైప్లో పరీక్ష ఉంటుంది.
తెలుగు -20, ఇంగ్లిష్- 25, పరిసరాల విజ్ఞానం -20, మెంటల్ ఎబిలిటీ -10 మార్కులు ఉంటాయి.
ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించాలి.
పరీక్షా పత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది.
ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించేలా మెనూ అమలు చేస్తూ గురుకుల విద్యను బలోపేతం చేసింది. దీంతో గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి భారీ పోటీ నెలకొన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం దూర దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం పేద విద్యార్థులకు వరంగా మారింది. గురుకులాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో వేలాది మంది పేద విద్యార్థులు చదువుకు దగ్గరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు పోటీపడుతున్నారు.