ఖలీల్వాడి, ఆగస్టు 7: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతోనే మారుమూల ప్రాంతాలకు ఐటీ సేవలు విస్తరించాయని, వందలాది కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి కవిత సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడా రు. 500లకు పైగా ఐటీ కంపెనీలు టాస్క్తో అనుబంధం కలిగి ఉన్నాయని వివరించారు. నిజామాబాద్ ఐటీ టవర్లో 750 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పటికే 250 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికోసం ప్రతి నెలా జాబ్మేళా ని ర్వహిస్తామని, ఈనెల 29న మరో జాబ్మేళా ఉంటుందని వివరించారు. టెన్త్ నుంచి పీజీ చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఐటీ టవర్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుందని వెల్లడించారు.
కేసీఆర్ భాజాప్తా చెప్పి చేస్తారు..
ఆర్టీసీ విలీనం, సెక్రటేరియట్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ వివాదం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నేల మాళిగలు, గుప్తా నిధుల కోసం సచివాలయం కడుతున్నామని అన్నారని అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం విషయంలో ఆస్తుల కోసం అంటూ ఆగమాగం చేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ మా ఎన్నికల ఎజెండా అని, కరోనాతో కాస్త ఆలస్యమైందని అన్నారు. రూ.25వేలు రుణం ఉన్నవారికి ఇప్పటికే మాఫీ చేశామన్నారు. రుణమాఫీ కాం గ్రెస్ విజయం కాదని, కానీ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం మాత్రం కాంగ్రెస్ విజయమేనని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఏ పని అయినా భాజాప్తా చెప్పి చేస్తారని తెలిపారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ యువత కలలను ఐటీ హబ్ సాకారం చేస్తుందన్నారు.
ఇతర ప్రాం తాలకు వెళ్లకుండా జిల్లాలోనే ఉద్యోగం సంపాదించుకునేలా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 9న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారన్నారు. ఐటీ హబ్, మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్బండ్, వైకుంఠధామాలను ప్రారంభించి, శ్రీరామ గార్డెన్లో మున్సిపల్ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తారన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోర్డినేటర్ మహేశ్ బిగాల, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, వీజీగౌడ్, బాజిరెడ్డి జగన్, అలీం, సూదం లక్ష్మి పాల్గొన్నారు.