ఖలీల్వాడి, జనవరి 13 : నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయాలని నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మొద టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిం చి, రాష్ర్టాన్ని అభివృద్ధి పథం లో తీసుకెళ్లారని పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఈ ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ప్రజలకు అందే వరకు బీఆర్ఎస్ తరఫున ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పోటీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా, ఉద్యమకారులుగా కోరుకుంటున్నామని చెప్పారు.
గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కవితకే దక్కిందన్నారు. ఆమె హయాంలో నిజామాబాద్కు మెడికల్ కళాశాల, రెండు కేంద్రియ విద్యాలయాలు, నందిపేట్ సెజ్, రైల్వేలైన్లు వచ్చినట్లు తెలిపారు. ప్రజల చిరకాల కోరిక అయిన పసుపుబోర్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్లో గళం విప్పి విశ్వప్రయత్నాలు చేసిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు 284 ప్రశ్నలు వేసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఘనత కవితకే దక్కుతుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న ఉద్యమ నాయకురాలు కవిత మళ్లీ ఎంపీగా పోటీ చేయాల్సిందిగా జిల్లా ప్రజల పక్షాన కోరుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు సుజిత్సింగ్ ఠాకూర్, ఎనుగందుల మురళి, కరిపె రాజు, సత్యప్రకాశ్ పాల్గొన్నారు.