నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 14 : అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గంలోని ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను బుధవారం రాత్రి వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా కవిత ఎంపీపీలకు, నాయకులకు, కార్యకర్తలకు పలు సలహాలు, సూచనలు చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ హయాంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశారన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకొని హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ అవుతారని అందరం ఆశించినప్పటికీ తిరిగి అధికారంలోకి రాకపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రజాతీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లో అత్యధిక బలగమున్న బీఆర్ఎస్ శ్రేణులందరూ అంతర్గతంగా ఏవైనా విభేదాలుంటే వాటిని విడనాడి, కలిసికట్టుగా కృషి చేసి అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని సత్తాను చాటాల్సిన అవసరముందన్నారు. తాను కూడా జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా బలమైన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టి పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ కవిత, బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసిన వారిలో ఎంపీపీలు అనుషాప్రేమ్దాస్, లతా కన్నీరాం, నల్ల సారికాహన్మంత్రెడ్డి, రమేశ్నాయక్, విమలా రాజు, సంగీతా రాజేందర్, నాయకులు రాజన్న ఉన్నారు.