ఖలీల్వాడి, నవంబర్ 18 : నిజామాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో కల్వకుంట్ల కవిత పోస్టు చేశారు. అమరవీరుల కుటుంబాలు క్షమాపణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవడానికి గాంధీ కుటుంబమే కారణం.
అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తు చేసేందుకు నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారని కవిత పేర్కొన్నారు. ఆత్మబలిదానాలన్నీ కాంగ్రెస్ హత్యలే అని అంటున్న నిజామాబాద్ విద్యార్థులు, యువత మాటలను వినాలని రాహుల్గాంధీకి సూచించారు.