హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తండ్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) దంపతులు ఆశ్వీరదించారు. పుట్టినరోజు ( KTR Birthday ) సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కోరిక మేరకు మొక్కను నాటి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి ఇంకా కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.

కాగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా, వారి పైన జరుగుతు న్న నిర్బంధాన్ని నిరసిస్తూ , కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.