రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసిన ఎమ్మెల్యే షకీల్.. బోధన్ పట్టణ అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి త్వరలో నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. సానుకూలంగా స్పందించడంపై మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
-బోధన్, ఫిబ్రవరి 9