మద్నూర్/ పెద్దకొడప్గల్ / డోంగ్లీ, జనవరి 10 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే.. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను అర్హులకే అం దజేస్తామన్నారు. మద్నూర్లో 52, పెద్దకొడప్గల్లో 11, డోంగ్లీలో 20 చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.