నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రికల్ వాహనంలో తిరుగుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే కమాన్ వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులు, నిర్మాణంలో ఉన్న నూతన మున్సిపల్ భవనాన్ని పరిశీలించారు. వినాయక్ నగగర్లో పుట్ పాత్ పనులని పరిశీలించి పలు సూచనలు చేశారు.
అహ్మది బజార్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించి పనుల పురోగతిపై వివరాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు. బోధన్ రోడ్డులో గల శ్మశాన వాటిక స్టోన్ పిచింగ్ పనులని పరిశీలించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా, అధికారులు పాల్గొన్నారు.