కామారెడ్డి, మార్చి 18;మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమానికి మజిలీగా నిలుస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కామారెడ్డి దశ,దిశ మారిపోయింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, ప్రకృతివనాలతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. నియోజకవర్గంలోని బడుల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లను వెచ్చించింది. ఒక్క కామారెడ్డి పట్టణ సుందరీకరణ కోసమే వంద కోట్లకు పైగా ఖర్చు చేసింది. మెడికల్ కాలేజీని మంజూరు చేయడమే కాకుండా రూ.235 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రుల పాలనలో అభివృద్ధికి దూరమైన కామారెడ్డి నియోజకవర్గం.. నేడు గంప గోవర్ధన్ నేతృత్వంలో ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నది.
స్వరాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రగతి పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేయూతతో జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు పచ్చగా మారగా.. పట్టణాలు సుందరంగా తయారయ్యాయి. సీమాంధ్రుల పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో కామారెడ్డి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. ఏ సంక్షేమ పథకాల్లోనైనా నియోజకవర్గం ముందుకు దూసుకెళ్తుంది. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ కృషితో నియోజకవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, రాజంపేట, దోమకొండ మండలాలు ప్రగతిపథంలో నడుస్తున్నాయి.
సుందరంగా పట్టణం..
కామారెడ్డి పట్టణం విస్తరించడం, జిల్లా అయిన తర్వాత అనూహ్యంగా అభివృద్ధి చెందడంతో ఇప్పుడీ ప్రాంతం పట్టణంలో ఓ భాగమైంది. ఎనిమిదిన్నరేండ్లలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంపగోవర్ధన్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం రూ.100కోట్లను మంజూరు చేసింది. దీంతో పట్టణ రూపురేఖలు మారాయి. కామారెడ్డి పట్టణానికి కేటాయించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. రూ.6కోట్లతో కళాభారతి ఆడిటోరియం, రూ.4.50 కోట్లతో మోడల్ మార్కెట్, రూ.3 కోట్లతో జంక్షన్ల అభివృద్ధి, రూ.1.65 కోట్లతో సెంట్రల్ లైటింగ్, రూ.1.60 కోట్లతో 4పార్కుల అభివృద్ధి, రూ.2 కోట్లతో రెండు వైకుంఠధామాల అభివృద్ధి, రూ.5 కోట్లతో ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీ సిస్టమ్ నిర్మాణం, రూ.13 కోట్లతో కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో హరితహారం, రూ.15కోట్లతో టేక్రియాల్ నుంచి నర్సన్నపల్లి, నిజాంసాగర్ చౌరస్తా నుంచి లింగాపూర్కు నాలుగు లైన్లరోడ్లు వేశారు. రూ.15లక్షలతో మున్సిపల్ కార్యాలయం ఆవరణ, గంజ్లో స్ట్రీట్ వెండింగ్ జోన్స్ను ఏర్పాటు చేశారు. కాలనీల మధ్య సీసీ రోడ్ల అనుసంధానం, పార్కుల అభివృద్ధి, పట్టణవాసుల కోసం ఓపెన్ జిమ్ల ఏర్పాటు, ప్రధాన రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధితో సరికొత్త పట్టణంగా రూపాంతరం చెందింది.
విద్యారంగానికి పెద్దపీట..
ప్రస్తుతం విద్యారంగంలో పోటీ నెలకొన్నది. ప్రపంచ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. మనఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో 84 పాఠశాలలు ఎంపికయ్యాయి.ఇందులో ప్రైమరీ పాఠశాలలు 43,అప్పర్ ప్రై మరీ 6, హైస్కూళ్లు, 35పాఠశాల లు ఎంపిక అయ్యాయి. 84 పాఠశాలలకు 31,85,19,143 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. దీం తో పాఠశాలలను అన్ని వసతులతో తీర్చిదిద్దారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ ) గుర్తింపులో ఏ గ్రేడ్ సాధించింది. కళాశాలలోని 8 ఎకరాల్లో రూ.7.5 లక్షలతో రాశివనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు రకాల పం డ్ల చెట్లను ఐదు ఎకరాల్లో, మూడు ఎకరాల్లో 12 రాశులకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు.
కార్పొరేట్కు దీటుగా వైద్య సదుపాయాలు..
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సర్కారు దవాఖానల్లో కార్పొరేటుకు దీటుగా వసతులు కల్పించారు. కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. గర్భిణులకు సేవలందించేందుకు 102 అంబులెన్స్ను అందుబాటులో ఉంచారు. కామారెడ్డి ఏరియా దవాఖానలో ఐసీయూ, ప్యాలెట్ థెరపీ, 30 పడకల గదుల నిర్మాణం వంటి సౌకర్యాలు కల్పించింది. జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం, లేబర్ రూం, ట్రామాకేర్, ఐసీయూ, డయాలసిస్, పాలియేటివ్ కేర్, నూతన ల్యాబ్ గది, అత్యాధునిక వసతులు సమకూరాయి. ఇటీవల మహిళల కోసం ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రారంభించింది. 21,190 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కామారెడ్డి ఏరియా దవాఖానకు రెండుసార్లు కాయకల్ప అవార్డు లభించింది. కామారెడ్డిలో 100 పడకల దవాఖాన ఉండగా, దీనిని అప్గ్రేడ్ చేస్తూ జీవో విడుదల చేయగా, మరో 100 పడకల మాతా శిశు కేంద్ర దవాఖాన ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.235కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా పనులు కొనసాగుతున్నాయి.
మార్పు కనిపిస్తున్నది..
ఎనిమిదిన్నరేండ్లలో కామారెడ్డి పట్టణం మరింత అభివృద్ధి చెందింది. రోడ్లు సుందరంగా మారాయి. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. విద్యా, వైద్య రంగంలో అద్వితీయమైన మార్పు కనిపిస్తున్నది. పల్లె,పట్టణ ప్రగతితోపాటు హరితహారంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది.
– ఎ.నిట్టు జాహ్నవి, మున్సిపల్ చైర్పర్సన్, కామారెడ్డి
పరిపాలన మరింత చేరువ..
నియోజకవర్గంలో కొత్త మండలాలను ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. గ్రామీణ స్థాయిలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి పోటీ పరీక్షల అభ్యర్థులకు అండగా ఉంటుంది. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ కృషితో నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది.
–బి.పున్న రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్, కామారెడ్డి
సంక్షేమంలో..
కామారెడ్డి నియోజకవర్గం సంక్షేమ పథకాల్లోనూ దూసుకుపోతున్నది. కామారెడ్డి నియోజకవర్గంలో రైతుబంధు పథకం ద్వారా 2,82,865 మంది రైతులకు రూ.22కోట్ల82లక్షల64వేలు పంపిణీ చేశారు. రైతుబీమా ద్వారా 5,178 మం ది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.260 .87 కోట్లు పంపిణీ చేశారు. దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 100మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున రూ.10కోట్లు పంపిణీ చేసి ఆర్థిక చేయూతనందించారు. 9,422 మందికి కల్యాణలక్ష్మి, 1,750 మందికి షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 63,482 మందికి ఆసరా పింఛన్లను అందజేస్తున్నారు. వడ్డీలేని రుణాలు రూ.14 కోట్ల 40 లక్షల 71 వేలు పంపిణీ చేశారు. 1700 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందించి సొంతింటి కల సాకారం చేశారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్నది..
కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది. పట్టణంలోని రోడ్లు అద్దల్లా మెరుస్తున్నాయి. తాగునీటి సమస్య తీరింది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో హైదరాబాద్కు దీటుగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
–రాంరెడ్డి, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు
సుందరంగా మారింది..
కామారెడ్డి నియోజకర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఎంతో సుందరంగా మారింది. గత పాలకుల చేతుల్లో నిర్వీర్యం అయిన నియోజకవర్గం తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో అన్ని సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నది.
–శేషారావు, ప్రముఖ కవి