బాన్సువాడ, జనవరి 2: సింగూర్, జుక్కల్ సెగ్మెంట్ పరిధిలోని మిషన్ భగీరథ 145 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రధాన పైపులైన్లో లీకేజీల మరమ్మతు నిర్వహణ కోసం బుధ, గురువారాల్లో మిషన్ భగీరథ పథకంలో వచ్చే తాగునీటిని నిలిపివేస్తున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాలతోపాటు జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. గ్రామాల్లోని బోర్వెల్స్ను వాడుకోవాలని, ప్రజలు సహకరించాలని కోరారు.