మోర్తాడ్, అక్టోబర్1: మండలంలోని గాండ్లపేట్, పాలెం, తిమ్మాపూర్,మోర్తాడ్, సుంకెట్ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గాండ్లపేట్లో నూతన జీపీ భవన నిర్మాణానికి, పాలెం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, పాలెం-తిమ్మాపూర్ రోడ్డుపై స్లాబ్, కల్వర్టు నిర్మాణానికి, పాలెం-ధర్మోరా బీటీరోడ్డు నిర్మాణానికి, బ్రిడ్జి నిర్మాణానికి, తిమ్మాపూర్లో తిమ్మాపూర్-కమ్మర్పల్లి రోడ్డు స్పెషల్ రిపేర్స్ కోసం, తిమ్మాపూర్-ఉప్లూర్ బీటీరోడ్డు రెన్సువల్, మోర్తాడ్లో స్లాబ్ కల్వర్టు నిర్మాణానికి, మోర్తాడ్ హైవేపై పాలెం ఎక్స్రోడ్డు నుంచి పెట్రోల్ బంకు వరకు రోడ్డు వెడల్పు, సెంట్రల్లైటింగ్కు, మోర్తాడ్-భీమ్గల్ రోడ్డుపై స్లాబ్ కల్వర్టు నిర్మాణానికి, పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.50లక్షలతో నిర్మించిన ప్రజా కళ్యాణమండపాన్ని ప్రారంభించారు.
సుంకెట్లో సుంకెట్-వెంకటాపూర్ మధ్యలో పెద్దవాగుపై నిర్మించే రోడ్డు, డ్యామ్ నిర్మాణ పనులకు, సుంకెట్-మోర్తాడ్ రోడ్డుపై కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, రాష్ట్ర విత్తన కమిటీ సభ్యుడు సంజీవ్రెడ్డి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, సొసైటీ చైర్మన్ అశోక్, రైతుబంధు మండల కన్వీనర్ పర్స దేవన్న, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, వైస్ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు బోగ ధరణి, మామిడి సౌజన్య, సంతోష్, గడ్డం చిన్నారెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీసీలు అస్మాఅజారుద్దీన్, రాజ్పాల్, అశోక్, సత్యనారాయణ, బోగ ఆనంద్, గంగారెడ్డి, ఇంతియాజ్, జేసీ గంగారెడ్డి, చిన్నారెడ్డి, దడివెనవీన్, రోహిత్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాలో మంత్రి వేముల పర్యటన
వేల్పూర్, అక్టోబర్1: రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు రూ.8కోట్ల15లక్షల వ్యయంతో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో పాలెం నుంచి ఏర్గట్ల వయా తొర్తి బీటీ రోడ్డుకు పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10 గంటలకు బట్టాపూర్ గ్రామంలో రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, రూ.10లక్షలతో పైప్ కల్వర్టు నిర్మాణ పనులు, ఉదయం 10.45 గంటలకు ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ నుంచి తాళ్లరాంపూర్ రూ.కోటి 80లక్షలతో బీటీ రోడ్డు పనులు, గుమ్మిర్యాల్ నుంచి కొండపూర్ రోడ్డుపై స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు రూ.50లక్షలు, ఉదయం 11.30గంటలకు దోంచంద నుంచి తాళ్లరాంపూర్ వరకు రూ.కోటి 30లక్షలతో బీటీ రోడ్డు రెన్యువల్ పనులు, మధ్యాహ్నం 12 గంటలకు కమ్మర్పల్లి, తడ్ పాకల్ రోడ్డుపై తాళ్లరాంపూర్ వద్ద రూ.కోటి 60లక్షలతో మైనర్ బ్రిడ్జి, రూ.4కోట్ల45లక్షలతో తాళ్లరాంపూర్-వర్షకొండ వరకు రోడ్డు రెన్యువల్ పనులు, రూ.కోటి 30లక్షలతో తాళ్ల రాంపూర్ నుంచి దోంచంద వరకు రోడ్డు రెన్యువల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ఎర్గట్ల మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రూ.కోటి 62లక్షలతో ఎన్ఏబీఏఆర్డీ గోడౌన్, సీసీ ప్లాట్ ఫామ్, సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనలకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ.కోటి 20లక్షలో బట్టాపూర్ గూడూర్ రోడ్డు రెన్యువల్ పనులకు, మధ్యాహ్నం 1గంటకు కమ్మర్పల్లి, తడ్పాకల్ రోడ్డుపై ఊప్లూర్, ఆర్ఆర్ నగర్ వద్ద న్యారో బ్రిడ్జి విస్తరణ పనులకు రూ.కోటి 12లక్షలతో శంకుస్థాపన, మధ్యాహ్నం 3 గంటలకు ముప్కాల్ మండలం వెంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ.2కోట్ల50లక్షలతో కిసాన్ నగర్ నుంచి రెంజర్ల రోడ్డు వయా వేంపల్లి వరకు, రూ.20లక్షలతో కిసాన్ నగర్లో హెల్త్ సబ్ సెంటర్, రూ.5లక్షలతో నూతన అంగన్వాడీ భవనం పనులకు, సాయంత్రం 4.30గంటలకు ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు. రూ.4కోట్ల 40లక్షలతో బుస్సాపూర్ నుంచి పెద్దవాగు వరకు రోడ్డు రెన్యువల్ పనులు, రూ.2కోట్ల33లక్షలతో నాగంపేట్ నుంచి వెల్కటూర్ తండా వరకు రోడ్డు నిర్మాణ పనులు, సాయంత్రం 5.30 గంటలకు ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామంలో రూ.50లక్షలతో స్లాబ్ కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన, రూ.2కోట్ల50లక్షలతో కిసాన్ నగర్- రెంజర్ల బీటీ రోడ్డు వయా వేంపల్లి పనులకు, రూ.4కోట్ల40లక్షలతో బుస్సాపూర్ నుంచి పెద్దవాగు వరకు రోడ్డు రెన్యువల్ పనులకు , సాయంత్రం 6.30గంటలకు వెంచిర్యాల్ గ్రామంలో రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.