నిజామాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకోవడానికి ప్రధానకారకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నేడు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం మన్ననలు పొందుతుండడానికి సీఎం పడుతున్న శ్రమనే కారణమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి ప్రశాంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉత్సవాల్లో మొదటిరోజు జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 22 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే…
గణనీయంగా వ్యవసాయ వృద్ధి..
జిల్లాలో 2014లో 4.14 లక్షల ఎకరాల పంటల సాగువిస్తీర్ణం ఉంటే 9 సంవత్సరాల్లో 1.25 లక్షల ఎకరాలకు పెరిగింది. 2022 యాసంగి నాటికి 5.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. వరి సాగు 2014లో 1.93 లక్షల ఎకరాల్లో ఉంటే 2022నాటికి 116 శాతం వృద్ధితో 4.18 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. 4,557 రైతులు మరణిస్తే రైతుబీమా ద్వారా రూ. 227 కోట్లు ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెల్లించింది. 106 మంది ఏఈవోల పోస్టుల నియామకం చేపట్టడంతోపాటు 106 రైతు వేదికలను రూ.23.32 కోట్లు వెచ్చించి నిర్మించింది.
పల్లె ప్రగతి భేష్..
గ్రామ పంచాయతీలకు ఏటా సుమారు రూ.120 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాము. 2014 నుంచి 2023 వరకు రూ.689.96 కోట్ల నిధులు విడుదల చేశారు. గ్రామ పంచాయతీలో 500 మంది జనాభాకు ఒకరు చొప్పున 2,288 మల్టీ పర్పస్ వర్కర్లను నియమించి.. నెలకు రూ.9,500 చొప్పున వేతనం చెల్లిస్తున్నాము. 530 జీపీల్లో రూ.13.25కోట్లతో సిగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేశాము.
7 లక్షల మందికి కంటి పరీక్షలు..
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 7 లక్షల 14వేల మందికి కంటి పరీక్షలు పూర్తిచేశాం. 86,243 మందికి రీడింగ్ కళ్లద్దాలు, 65 వేల మందికి దూరపు చూపు అద్దాలు పంపిణీ చేశాం. 927 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. ప్రతి మంగళవారం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సాఫీగా కొనుగోళ్లు
2014-15 నుంచి ఇప్పటివరకు 75.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.13,687 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు చెల్లింపులు చేసింది. ఈ యాసంగి సీజన్లో 5లక్షల 92వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 483 కేంద్రాల ద్వారా 84వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.552కోట్లు చెల్లింపులు చేసింది. 2023-24లో 4,600 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
మత్స్యాభివృద్ధి
ప్రస్తుతం జిల్లాలో 353 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 22వేల 622 మంది సభ్యులు ఉన్నారు. పోచంపాడ్ ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి 9 సంవత్సరాల్లో రూ. 12కోట్లు వెచ్చించి కోటి చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యానికి 92 లక్షల చేపపిల్లల ఉత్పత్తి జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 258 సొసైటీల ద్వారా ఉచితంగా 19.76 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. గొల్ల, కురుమలకు 75శాతం రాయితీతో 19వేల 106 యూనిట్లు పంపిణీ చేసింది. జీపీలకు భారీగా అవార్డులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జిల్లాకు జాతీయస్థాయిలో ఎన్నో పురస్కారాలు అందాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన 2021-22 కింద దేశ వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా.. తెలంగాణ నుంచి 19 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. ఇందులో 5 గ్రామ పంచాయతీలు మన జిల్లాకు చెందినవే. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కింద చేసిన అత్యుత్తమ పనికి గుర్తింపుగా దేశంలోని మొత్తం జిల్లాల విభాగంలో నిజామాబాద్ జిల్లా 3వ స్థానాన్ని సాధించింది.
జీపీలకు భారీగా అవార్డులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జిల్లాకు జాతీయస్థాయిలో ఎన్నో పురస్కారాలు అందాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన 2021-22 కింద దేశ వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా.. తెలంగాణ నుంచి 19 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. ఇందులో 5 గ్రామ పంచాయతీలు మన జిల్లాకు చెందినవే. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కింద చేసిన అత్యుత్తమ పనికి గుర్తింపుగా దేశంలోని మొత్తం జిల్లాల విభాగంలో నిజామాబాద్ జిల్లా 3వ స్థానాన్ని సాధించింది.
సాగు భళా…
నిజామాబాద్ జిల్లాలో 2014 నుంచి 2022 వరకు భారీ, మధ్య తరహా, చిన్న నీటి పారుదల, చెక్డ్యాంలు, చిన్న నీటి ఎత్తిపోతల పథకాలు, పుష్కరఘాట్ పనుల కోసం ఇప్పటివరకు రూ.3,894 కోట్లు ఖర్చు చేసింది. 2015 నుంచి 841 చెరువులకు రూ.348.53 కోట్లతో మిషన్ కాకతీయ పనులు చేపట్టాం. 2014 నుంచి జిల్లావ్యాప్తంగా 47 చెక్డ్యాంల నిర్మాణాన్ని చేపట్టాం. వర్ని మండలంలోని చెరువుల అభివృద్ధి, సామర్థ్యం పెంపుదలకు రూ.72.52 కోట్లతో సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కొనసాగుతున్నది. చద్మల్, పైడిమల్, నామ్కల్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కాలువల తవ్వకానికి రూ.46.89 కోట్లతో పనులు జరుగుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు ముఖ్య కాలువల ఆధునీకరణలో భాగంగా 80 కిలోమీటర్లు ప్రధాన కాలువ లైనింగ్, ఉప కాలువల ఆధునీకరణ పనులను పూర్తి చేశాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద జిల్లాలో 2014 నుంచి 2022 మధ్య కాలంలో రూ.62.66 కోట్లతో ముంపు గ్రామాలకు సీసీ రోడ్లు, కట్టపై గోడ, బీటీ రోడ్, డ్యామ్ గేట్లు మరమ్మతులు చేశాం.