మోర్తాడ్, అక్టోబర్20: ‘పాడిందే పాడరా…పాసుపండ్ల దాసిగా అన్న తీరుగా ఉంది రాహుల్గాంధీ వైఖరి. ఇక్కడి కాంగ్రెస్ సన్నాసులు రాసిచ్చిన స్క్రిప్ట్నే చదువుతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడని.. రాష్ట్రరోడ్లు భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. తాత నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్గాంధీ, తల్లి సోనియాగాంధీ పేరు చెప్పుకుంటూ… కేసీఆర్ది కుటుంబపాలన అని మాట్లాడుతు న్న రాహుల్గాంధీని పప్పు అని అనడంలో తప్పేమిలేదని అన్నారు. నీది జాతీయ పార్టీనా.. ప్రాంతీయ పార్టీనా.. రాష్ర్టానికో విధానం, రాష్ర్టానికో మ్యానిఫెస్టో ఉంటదా అని శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటిస్తున్న కాంగ్రెస్ తన మోసపూరిత వైఖరిని ఇక్కడే బయటపెట్టుకుంటున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఛత్తీస్గఢ్లో రూ.500, రాజస్థాన్లో రూ.750, కర్ణాటకలో రూ.1000 మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మొదట రూ.4వేల పింఛన్లు ఇచ్చి తర్వాత తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయకుండానే ఇక్కడ ఇస్తామని చెప్తే నమ్ముతారా అని ప్రశ్నించారు.
రూ.200 ఉన్న పింఛన్ను రూ.2000 చేసిన ఘనత కేసీఆర్దని, ఇప్పుడు మ్యానిఫెస్టోలో రూ.5వేలు ఇస్తామని చెప్పిండు బరాబర్ చేస్తాడు అన్ని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం, నూతన పరిశ్రమలకు పెట్టుబడుల వెల్లువ, యువతకు లక్షల ఉద్యోగాల కల్పన, ప్రపంచస్థాయి ప్రశంసలు ఇలా అన్ని రంగాల్లో తెలంగా ణ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ఇది తెలుసుకొని రాహుల్ మాట్లాడాల ని హితవు పలికారు. అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుందని, దేశంలో కాంగ్రెస్ చేయని స్కాము ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పాలని, కాంగ్రెస్ అంటేనే అవినీతి..కుంభకోణాలని ఎద్దేవా చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 60 ఏండ్ల కాంగ్రెస్ పాపాలను కడిగామని మంత్రి అన్నారు. రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే లక్షకోట్ల అవినీతి ఎలా జరిగింది రాహుల్ గాంధీ, ఇది స్క్రిప్ట్ కాకపోతే మరేంటి అని ప్రశ్నించారు.
తెలంగాణను అన్ని రకాల అరిగోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన అన్ని హక్కులను కాంగ్రెస్ పార్టీ కాలరాసిందన్నారు. 1969లో తెలంగాణ కోసం ఉద్యమిస్తే 300 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సీఎంపీలో పెట్టి మోసం చేస్తే వందల మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజలను గ్యారెంటీల పేరుతో ఓట్లు అడుగుతున్నావని నిలదీశారు. ధరణి పోర్టల్ గురించి రాహుల్గాంధీకి కనీస అవగాహన లేదని, లంచాలు, దళారీ వ్యవస్థ నుంచి రైతులు విముక్తులైతే ధరణి నచ్చుత లేదా.. అని ప్రశ్నించారు. మండుటెండల్లో చెరువుల అలుగు పారుతుంటే, నిండిన చెరువుల్లో చేపపిల్లలు చెంగుచెంగున ఎగురుతుంటే మా మత్స్యకారుల సంబురం నచ్చుతలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం ప్రజలకు అర్థమైందని, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సహకరించుకున్న తీరు మరచిపోరని అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే 60ఏండ్లు వెనక్కిపోతామని, తెలంగాణను ముంచిన కాంగ్రెస్ కావా ల….! తెలంగాణను సుభిక్షం చేసిన కేసీఆర్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలన్నారు.