భిక్కనూరు, డిసెంబర్ 24 : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో శనివారం పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలకేంద్రానికి చెందిన సిద్ధిరామేశ్వర మున్నూరుకాపు సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరినట్లు వారు స్పష్టంచేశారు. బీఆర్ఎస్లో చేరిన వారికి ప్రభుత్వ విప్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ గాల్రెడ్డి, సర్పంచ్ తునికి వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్రెడ్డి, మాజీ సర్పంచ్ నాగభూషణంగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రామచంద్రం, ఉపసర్పంచ్ నరేశ్, టౌన్ ప్రెసిడెంట్ మల్లేశం, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సరస్వతి భూపాల్, ఆకుల బలరాం, మున్నూరు కాపు సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.