Hanging | వినాయక నగర్, జూలై 9 : నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఇంట్లోంచి దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచామందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని, బ్లాక్ నెంబర్ 13/2లో పై అంతస్తులు ఉండే జగదీష్ ఇంటి తలుపులను లోబడి నుండి పెట్టుకొని ఉండడంతో పోలీసులు స్థానికుల సహాయంతో డోర్లను తెరిచి చూశారు. ఆ ఇంట్లో మొదటి గదిలో ఆయన ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య గత కొంత గీతం చనిపోవడం, అప్పటినుండి ఆయన ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని మృతుడి తమ్ముడైన మహేందర్కు పోలీసులు ఫోన్ చేసి సమాచారమందించారు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమిటన్న విషయం తెలియ రాలేదు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.