వేల్పూర్, జూలై 29 : రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామ గౌడ సంఘం, మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ యాదవ సంఘ సభ్యులు శనివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరంపర కొనసాగుతున్నదని అన్నారు. గుమ్మిర్యాల్ గ్రామ రైతుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ధర్మోరా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. పార్టీలో చేరి ఇతర సంఘాల సభ్యులకు ఆదర్శంగా నిలిచారని, గ్రామాల్లో అభివృద్ధి తన బాధ్యత అని పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ బిడ్డే కదా లాభపడేదని సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా ఆలోచిస్తారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని గడప లేదని తెలిపారు.అన్ని పార్టీలకు రాజకీయం ఒక గేమ్ అయితే బీఆర్ఎస్కు మాత్రం టాస్క్ అని అన్నారు. రైతులు, పేదల కోసం కేసీఆర్ ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. కొంతమంది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వేల్పూర్, జూలై 29 : రాజకీయాలకతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామ గౌడ సంఘం, మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ యాదవ సంఘ సభ్యులు శనివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరంపర కొనసాగుతున్నదని అన్నారు. గుమ్మిర్యాల్ గ్రామ రైతుల కోసం లిఫ్ట్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ధర్మోరా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. పార్టీలో చేరి ఇతర సంఘాల సభ్యులకు ఆదర్శంగా నిలిచారని, గ్రామాల్లో అభివృద్ధి తన బాధ్యత అని పేర్కొన్నారు. ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ బిడ్డే కదా లాభపడేదని సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా ఆలోచిస్తారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని గడప లేదని తెలిపారు.అన్ని పార్టీలకు రాజకీయం ఒక గేమ్ అయితే బీఆర్ఎస్కు మాత్రం టాస్క్ అని అన్నారు. రైతులు, పేదల కోసం కేసీఆర్ ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. కొంతమంది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.