పార్టీ మండల అధ్యక్షులు
కమ్మర్పల్లి(మోర్తాడ్), నవంబర్24: టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పార్టీ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ విషయాలపై ఇంటింటికీ అవగాహన కల్పించాలని సూచించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ బద్దంరాజేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు గంగారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బద్దం చిన్నారెడ్డి, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ అనిల్, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, సుభాష్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను వివరించాలి
బాల్కొండ, నవంబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకూ వెళ్లి వివరించాలని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భారీ విజయం సాధించేలా కృషిచేయాలన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, మంత్రి ప్రశాంత్రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ఇంటింటికీ తీసుకెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఎంపీటీసీలు, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.