contract faculty | భిక్కనూరు, మే 01 : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు గత పది రోజులుగా చేస్తున్న సమ్మెను గురువారం విరమించారు. రెండు రోజుల క్రితం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆదేశాలతో తెలంగాణ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్, రిజిస్టార్ ఆదేశాల మేరకు దక్షిణ ప్రాంగణంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ , డాక్టర్ టీ ప్రతిజ్ఞ కాంట్రాక్ట్ అధ్యాపకులకు నిమ్మరసం అందజేసి సమ్మెను విరమింపజేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల కోఆర్డినేషన్ కమిటీ నెంబర్ డాక్టర్ నారాయణగుప్త మాట్లాడుతూ ప్రభుత్వంపై విశ్వాసంతో తాము సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, యూజీసీ పే స్కేల్ కల్పిస్తే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, తమపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, వైశాలి, సరిత, శ్రీకాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.