నిజాంసాగర్/బిచ్కుంద : హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంతో పాటు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం నిజాంసాగర్, బిచ్కుంద మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్కు బయలు దేరి వెళ్లారు. నిజాంసాగర్ మండల ఎంపీపీ పట్లోల్ల జ్యోతిదుర్గారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు రమేశ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు, ఎంపీపీ అశోక్పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, రైతుసమితి అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్వర్రెడ్డిలను నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.