బాన్సువాడ, ఆగస్టు 8 :యావత్ దేశం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన బాన్సువాడకు రాగా ఆర్టీసీ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. స్పీకర్తోపాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న ఆర్టీసీ విలీన నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ కేసీఆర్లాంటి దమ్మున్న నాయకుడిని చూడలేదన్నారు. కర్ణాటకలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని.. దేశంలో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. స్పీకర్ పోచారం, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ యావత్ దేశం కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నదన్నారు. రాష్ట్ర సంపదను పెంచి రైతులు, పేదలకు, ఉద్యోగులు, అన్ని వర్గాలకు పంచాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని తెలిపారు. రాష్ట్రంలో 93 ఆర్టీసీ డిపోల్లో సుమారు 43 వేలకు పైచిలుకు ఆర్టీసీ కార్మికులకు 50 ఏండ్ల కల సాకారమైందన్నారు. ప్రస్తుతం మీరు కార్మికులు కాదని.. ప్రభుత్వ ఉద్యోగులు అని తెలిపారు. అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ బిల్లు త్వరలోనే చట్టంగా మారుతుందని తెలిపారు. సంస్థ ఉద్యోగులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. ప్రతిపక్షాలలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడేందుకు తన్నుకోవడమే సరిపోతుందని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో చేతులెత్తేసిన కాంగ్రెస్
పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని.. తెలంగాణ పథకాలు తమ రాష్ర్టాల్లో ఎందుకులేవని ఇతర రాష్ర్టాల ప్రజలు అడుగుతున్నారని స్పీకర్ పోచారం అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి హామీలు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక కర్ణాటక సీఎం చేతులెత్తేశాడన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ప్రజలకు తినడానికి బియ్యం లేవని, తమ రాష్ర్టానికి బియ్యం పంపాలని కర్ణాటక సీఎం మన ముఖ్యమంత్రికి ఉత్తరం రాశాడని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే కాంగ్రెస్ పార్టీ పని అన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్ వన్గా ఉందని తెలిపారు. 2014లో తలసరి ఆదాయం రూ.1.12 లక్షల ఉండగా ఇప్పుడు రూ.3.12 లక్షలకు పెరిగిందన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల 10 లక్షల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని వివరించారు. రాష్ర్టానికి ఒక మంచి నాయకుడు సీఎం కేసీఆర్ దొరికాడని అన్నారు. మణిపూర్, హర్యానా రాష్ర్టాల్లో జరిగిన సంఘటనలు దేశానికి మంచివి కావన్నారు. శాంతిభద్రతల ఉల్లంఘన జరుగుతున్నా అక్కడి ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. పదేండ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ఐదేండ్లలో బాన్సువాడ నియోజక వర్గానికి పుష్కలంగా నిధులు వచ్చాయని అన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు స్పీకర్ పోచారం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఆత్మ కమిటీ చైర్మెన్ మోహన్ నాయక్ , ఆర్టీసీ డిపో మేనేజర్ సదాశివ, బసంత్, పండరి, మురళి, తదితరులు పాల్గొన్నారు.