సిరికొండ/ డిచ్పల్లి/ కోటగిరి, అక్టోబర్ 5 :సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చేసి ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బీ(టీ)ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
సిరికొండ కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్.. పార్టీ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మలావత్ సంగీతా రాజేందర్, సర్పంచులు ఎన్నం రాజిరెడ్డి, గాండ్ల సత్యానంద్, గద్దల గంగాదాస్, బొబ్బిలి రాజు, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల తిర్మల్, నాయకులు రాజకిషన్, మహేందర్, హరీశ్, ఆనంద్, ప్రవీణ్, రామస్వామి పాల్గొన్నారు.
డిచ్పల్లిలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీ(టీ)ఆర్ఎస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, సీనియర్ నాయకుడు లక్ష్మీనర్సయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దండుగుల సాయిలు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు గోపు చిన్నన్న, పద్మశాటీ సంఘం పట్టణ అధ్యక్షుడు గుజ్జేట్టి వెంకట నర్సయ్య, టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు ఆమేర్, మైనార్టీ నాయకుడు షాదుల్లా, సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్ నాయక్, ప్రధాన కార్యదర్శి హరికిషన్, కో-ఆప్షన్ మెంబర్ నయీం, టీఆర్ఎస్ నాయకులు నవీన్, కుమ్మరి చిన్నగంగారాం, అంజయ్య, భూమేశ్, రాజారాం, గంగాదాసు, పవన్, శ్రీనివాస్, లడ్డు, పాల్గొన్నారు.
పొతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు బీ (టీఆర్ఎస్) నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, సర్పంచ్ వర్ని శంకర్, గంట్ల విఠల్, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, మాజీ వైస్ చైర్మన్ జుమ్మాఖాన్, మాణిక్అప్పా, సందాని పాల్గొన్నారు.