హైదరాబాద్ ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలు నమ్మిన గ్రామీణ ప్రజలు మోసపోయారని, ఆలోచించగలిగిన నగరవాసులు తమతోనే ఉ న్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. తమ పార్టీ మీద ప్రజల్లో 100 శాతం నెగెటివ్ లేదని టీవీ9 ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.
జవాబు: కచ్చితంగా అదే జరిగింది. ఎన్నికల తర్వాత ఓడిపోయిన వాళ్లు, గెలిచిన వా ళ్లు, మా పార్టీ నాయకులు నాకు ఒక విషయం చెప్పారు. ‘సార్ ప్రజలకు మీ మీద ఏకాణా కో పం లేదు. కేసీఆర్ మీద జీరో నెగెటివ్. కొంతమంది అభ్యర్థుల పొరపాట్ల వల్ల ఓడిపో యాం. ఇంకా కొన్ని వేరే కారణాల వల్ల ఓడిపోయామే తప్ప.. 100 శాతం మీపై నెగెటివ్ లేదు. ప్రజలు అయ్యో కేసీఆర్ ఓడిపోతడని అనుకోలేదు’ అని అంటున్నారని చెప్పారు.
జవాబు: అందుకే నేను చెప్తున్నా. హైదరాబాద్ మాతోనే ఉంది. ఇక్కడ ఆలోచించగలిగిన వాళ్లు ఉన్నారు. అర్థం చేసుకున్నారు. కా నీ గ్రామీణ ప్రజలు అమాయకులు కాబట్టి.. కాంగ్రెసోళ్ల అడ్డగోలు హామీలను చూసి ట్రా ప్లో పడిపోయారు. ఇప్పుడు అదే గ్రామీణ ప్రజలు, గ్రామీణ ప్రాంతం తల్లడిల్లుతున్నది.
జవాబు: ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు వస్తారు. పార్లమెంట్ ఎన్నికలే ఇందుకు 100 శాతం పునాది వేస్తాయి.
జవాబు: కచ్చితంగా.. బస్సు యాత్రలో నేను చేసే పనే అది. బస్సు యాత్రలో వాస్తవాలను కుండబద్దలు కొడతాం.
జవాబు: ఇక్కడ బీజేపీకి గ్రౌండ్ దొరకలేదు. ప్రజాభిమానం దొరికి ఉంటే.. అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ వాళ్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నది? బీబీ పాటిల్ను ఈ రోజు పార్టీలో చేర్చుకొని రేపు టికెట్ ఇచ్చారు. ఇలా ఎంతోమందికి టికెట్లు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 107 సీట్లలో డిపాజిట్ పోయింది. మొన్నటి ఎన్నికల్లోనూ 64 సీట్లలో డిపాజిట్ పోయింది. అందుకే బీజేపీకి ‘వన్ సీట్ ఆర్ నో సీట్ ఇన్ తెలంగాణ’. ఆ ఒ క్క సీటు కూడా ఎక్కడ అని చెప్పలేం. మా సర్వే రిపోర్టుల్లో అనేకచోట్ల కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో, మరికొన్ని చోట్ల బీజేపీ థర్డ్ప్లేస్లో ఉంది.
జవాబు: ఫలితాలొస్తాయి కదా.. చూద్దాం.
జవాబు: అలా అనుకునేవాళ్ల మూర్ఖులు. కేసీఆర్ బ్రహ్మాండంగా ప్రజ్వలంగా ఉజ్వలంగా వస్తడు.
జవాబు: అభివృద్ధి నినాదంతో సెకండ్ టర్మ్లో 88 సీట్లతో వచ్చినం. నెక్ట్స్ టైం మేం 98 సీట్లతో వస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది. సోషల్ మీడి యా వాళ్లు ప్రజలను అడిగితే.. ‘ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి.. మా సంగతి చూపి స్తాం.. కేసీఆర్ను మళ్లీ తీసుకొస్తాం’ అని అంటున్నారు.
జవాబు: వారసుడిని నిర్ణయించే అధికారం ఎవరికీ ఉండదు. సమయం సందర్భాన్ని బట్టి నాయకులు తయారవుతారే తప్ప.. తయారు చేస్తే నాయకులు కారు.
జవాబు: ఉద్దేశపూర్వకంగా ఎవర్నీ నాయకులను తయారు చేయలేదు. ప్రాసెస్లో వ చ్చారు. సపోజ్ కేటీఆర్, హరీశ్ ఉన్నారు.. వా ళ్లకు ఒకసారి నేను సీటు ఇచ్చిన. ఆ తర్వాత వాళ్లకు ప్రతిభ ఉంటే.. ప్రజల్లో కలిసిపోతే.. హరీశ్ ఆరేడుసార్లు గెలిచాడు. రాము కూడా ఐదుసార్లు ఎమ్మెల్యే అయిండు. అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని నిలబెట్టుకున్నవాళ్లు ఎదుగుతారు.